Sunday, May 5, 2024

ముంబయి తాజ్ హోటల్ సిబ్బందికి కరోనా.. ఆందోళనలో డాక్టర్లు..

- Advertisement -
- Advertisement -

 

ముంబయి: నగరంలో కరోనా వైరస్(కోవిడ్-19) మహమ్మారి విలయతాండవం చేస్తోంది. తాజాగా ముంబయి తాజ్ హోటల్ లో కరోనా కలకలం రేపుతోంది. హోటల్లో ఉద్యోగం చేస్తున్న ఆరుగురు సిబ్బందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. వెంటనే వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించారు. దీంతో హోటల్ లో బస చేస్తున్న డాక్టర్లు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రం మహారాష్ట్రనే. ఇప్పటివరకు రాష్ట్రంలో 1895 కరోనా కేసులు నమోదు కాగా.. ఒక్క ముంబయిలోనే 1,259 కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 127 మంది కరోనాతో మరణించారు.

Mumbai Taj Hotel Employees test positive for Covid 19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News