Saturday, April 27, 2024

ఢిల్లీలో నడిరోడ్డుపై యువకుడిని కత్తులతో పొడిచి చంపిన దుండగులు

- Advertisement -
- Advertisement -

 

Delhi murder on road

న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణ హత్య చోటు చేసుకుంది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఓ యువకుడిని ఓ మూక కత్తులతో పొడిచి చంపింది. రద్దీ మార్కెట్‌లో చోటు చేసుకున్న ఈ హత్య దృశ్యాలు సిసిటివి ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం… ఢిల్లీకి చెందిన మయాంక్ (25) అనే ఓ హోటల్ మేనేజ్‌మెంట్ స్టూడెంట్,  గురువారం (ఆగస్టు 12) రాత్రి తన స్నేహితుడితో కలిసి మాళవియ నగర్‌లోని మార్కెట్‌కి వెళ్లాడు. ఆ సమయంలో హఠాత్తుగా నలుగురు వ్యక్తులు కత్తులతో మయాంక్ వద్దకు పరిగెత్తుకొచ్చారు. కొద్దిసేపు మయాంక్‌కి, ఆ గ్యాంగ్‌కి మధ్య వాగ్వాదం జరిగింది.

ఈ క్రమంలో మయాంక్ అక్కడి నుంచి పరిగెత్తగా ఆ గ్యాంగ్ అతన్ని వెంబడించి పట్టుకున్నారు. ఆపై కత్తులతో విచక్షణారహితంగా మయాంక్‌పై దాడి చేశారు. నడిరోడ్డు పైనే మయాంక్‌పై దాడి జరిగినా ఆపేందుకు ఎవరూ ముందుకు రాలేదు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన మయాంక్ కాసేపటికే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు సిసిటివి ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News