Friday, May 3, 2024

విడాకుల వదంతులతో బాధేస్తుంది: నాగచైతన్య

- Advertisement -
- Advertisement -

nagachaitanya and Samantha

న్యూఢిల్లీ: కొందరికి పనీపాట ఉండదు, ఏదో ఒక పుకారు పుట్టిస్తుంటారు. దీనికి సోషల్ మీడియా కూడా ఏమీ మినహాయింపు కాదు. తమ రేటింగ్ పెంచుకోడానికి ఏదో ఒక కాకమ్మ కబురు పోస్ట్ చేస్తుంటారు. ఇటీవల నాగచైతన్య, సమంతా విడాకులు తీసుకోబోతున్నారంటూ మీడియాలో తెగ వార్తలు కొందరు అదేపనిగా పెడుతున్నారు. దీనికి నాగచైతన్య స్పందించారు.
“మొదట్లో ఈ వదంతులకు నేను కాస్త బాధపడ్డాను. ఎందుకిలా జరుగుతోందనిపించింది. కానీ నేటి కాలంలో వార్తను మరో వార్త పూడ్చేస్తుంది అని అర్థమైంది.ఏ వార్తయినా ప్రజల మనస్సులో ఎకువ రోజులు ఉండదు. టిఆర్‌పి రేట్ల కోసం కొందరు నిరాధార వార్తలను కూడా రాసేస్తున్నారు. ఇది నేను గమనించాను. నేను సోషల్ మీడియాలో ఎక్కువ గడపను. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో కూడా ఎక్కువ గడపను. అయితే నేను కోవిడి19 మహమ్మారి తర్వాత ఒకటి రెండు సంవత్సరాలు సోషల్ మీడియాకు ప్రభావితుడనయ్యాను” అన్నారు. తన వ్యక్తిగత జీవితం, ప్రొఫెషనల్ జీవితం రెండూ వేర్వేరు అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఆ రెండింటిని కలపొద్దని కూడా విన్నవించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఓ కొత్త సినిమా ప్రమోషన్ పనిలో చాలా బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉండగా సమంతా అక్కినేని తన పేరును సోషల్ మీడియాలో మార్చినప్పటి నుంచి వారి విడాకుల పుకారు షికారు చేస్తోంది. ఈ మధ్యన సమంతా ఓ గుడిలో దైవదర్శనానికి వెళ్లినప్పుడు ఆమెను ఓ రిపోర్టరు విడాకుల వదంతిపై ప్రశ్నించారు. అప్పుడామె “నీ కసలు బుద్ధుందా, నేను గుడికి వచ్చానన్న స్ఫురన కూడా లేకుండా ఏమిటడుగుతున్నావు?” అని విరుచుకుపడిన విషయం అందరికీ తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News