Saturday, May 4, 2024

కృష్ణా జిల్లాలో ఎస్‌ఐ భర్త ఆత్మహత్య?

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎస్‌ఐ భర్త అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా నందివాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఎస్‌ఐ శిరీష- అశోక్ అనే యువకుడు రెండు సంవత్సరాల ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు సంవత్సరం వయసు ఉన్న కూతురు ఉంది. శిరీష్ నాలుగు నెలల క్రితం మచిలీ పట్నం నుంచి నందివాడకు బదిలీపై వచ్చారు. అశోక్ ఇంట్లో ఉరేసుకోవడంతో భార్య గమనించి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు చనిపోయాడని వెల్లడించారు. ఆశోక్ ఆత్మహత్య చేసుకోలేదని హత్య చేశారని ఆయన బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయ నేతలు, పోలీస్ ఉన్నతాధికారులు రాజీ కుదుర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.  ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటారని అశోక్ బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: మధుర ఫలం సీతాఫలం..!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News