Thursday, May 16, 2024

రాజీనామా ఉపసంహరించుకున్న నవజోత్ సిధు

- Advertisement -
- Advertisement -

Navjot Singh Sidhu
అమృత్‌సర్: నవజోత్ సింగ్ సిధు నెల రోజుల తర్వాత పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఇదివరలో చేసిన రాజీనామాను శుక్రవారం ఉపసంహరించుకున్నారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “నేను రాజీనామాను ఉపసంహరించుకున్నాను” అని తెలిపారు. ఆయన ఇంకా “నేను కొత్త అటార్నీ జనరల్ నియుక్తులయ్యాకే నా బాధ్యతలు స్వీకరిస్తాను. నా రాజీనామా వ్యక్తిగత అభిమానానికి సంబంధించింది కాదు, ప్రతి పంజాబీయుడి ప్రయోజనానికి సంబంధించింది” అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News