Tuesday, April 30, 2024

దంతెవాడ ఎన్‌కౌంటర్‌లో నక్సల్ హతం

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో శుక్రవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఒక నక్సలైట్ మరణించాడు. కిరండల్ పోలీసు స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని ఒక పోలీసు అధికారి తెలిపారు. పురంగల్, బడేపల్లి, దొడితుమన్నర్, గంపూర్ ప్రాంతాలలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా దళాలు గురువారం నుంచి గాలింపు చేపట్టినట్లు ఆయన చెప్పారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి ఒక నక్సలైట్ మృతదేహాన్ని, ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News