Monday, May 6, 2024

నవంబర్‌లో కొత్త ఆసరా ఫించన్లు అందజేత

- Advertisement -
- Advertisement -

New Aasara Pensions in November

కొనసాగుతున్న లబ్దిదారులు ఎంపిక ప్రక్రియ
ఇప్పటివరకు 1.25 లక్షల దరఖాస్తులు పరిశీలన
ఈనెలాఖరులోగా అర్హులను గుర్తిస్తామంటున్న అధికారులు
గ్రేటర్ 3.50లక్షలకు చేరుకోనున్న ఆసరా లబ్దిదారులు

హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కొత్త ఆసరా ఫించన్‌దారులు దసరా పండగకు ఫించన్ వస్తుందని ఎదురుచూస్తున్నారు. గత రెండు నెల నుంచి దరఖాస్తు చేసుకున్న వారంతా పండగల సంబురాలు చేసుకోవచ్చని ఆశపడితే అధికారులు నిర్లక్షానికి లబ్దిదారులు ఎంపిక ప్రక్రియ సాగదీస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ నిజమైన అర్హులను గుర్తిస్తామని పేర్కొంటూ ఈనెలాఖరులోగా ఆపనిపూర్తి చేసిన నవంబర్ రెండో వారంలో కొంతమందికి పింఛను అందజేస్తామని పేర్కొంటున్నారు. దీంతో వృద్దులు తమపై ప్రభుత్వం కరుణ చూపాలని వేడుకుంటున్నారు. మూడు నెల కితం ప్రభుత్వం వయస్సు కుదించి 57 ఏళ్ల వారికి ఫించన్లు అందజేస్తామని అర్హులైన వారు మీసేవా కేంద్రాల దరఖాస్తులు చేసుకోవాలని సూచించడంతో ఆశలు చిగురించాయి. దీంతో తమ వద్ద పత్రాలు తీసుకుని నగర ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్నారు. రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులు దరఖాస్తులు ఓటర్ లిస్టు, ఆధార్‌కార్డుల ద్వారా వయస్సు నిర్దారణ చేసి లబ్దిదారుల ఎంపిక వేగంగా చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

ఈనెలాఖరులోగా అర్హులను ఎంపిక చేసి వచ్చే నెలల్లో వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామంటున్నారు. ఇప్పటివరకు 1.25లక్షల దరఖాస్తులు పరిశీలిన చేసినట్లు, మరో 55 వేల వరకు ఉన్నాయని, వాటిని వీలైనంత త్వరగా పరిశీలన చేసి వారి జీవితాలకు భరోసా కల్పిస్తామని చెబుతున్నారు. గ్రేటర్ మూడు జిల్లాల పరిధిలో ప్రస్తుతం వృద్దాప్యం ఫించన్లు 1.42లక్షలమంది పొందుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.వారికి ప్రతి నెల ప్రభుత్వ రూ. 2016 చొప్పన అందజేస్తుంది. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే ఫించన్లు పెరిగి వృద్దులు, వితంతులు, వికలాంగులు ఎంతో ఆనందంగా ఉన్నారని స్దానిక ప్రజలు పేర్కొంటున్నారు. కొత్త ఆసరా ఎంపిక ప్రక్రియ పూర్తి అయితే గ్రేటర్ నగరంలో ఫించన్లు సంఖ్య 3.50లక్షలకు చేరుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. అదే విధంగా కొన్ని ప్రాంతాల్లో అర్హతలేకున్నా బోగస్ దృవపత్రాలు సమర్పించి ప్రభుత్వం ఖజానాకు గండి కొట్టాలని కుట్రలు చేస్తున్నారు. దరఖాస్తుపై అనుమానం ఉంటే నేరుగా ఇంటికి వెళ్లి పరిశీంచిన చేసి ఎంపిక చేస్తామని వెల్లడిస్తున్నారు. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా ఎంపిక చేసి వృద్దులకు చేయూతనందిస్తామని స్దానిక రెవెన్యూ సిబ్బంది పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News