Sunday, May 12, 2024

100 ఎకరాల్లో కొత్త హైకోర్టు

- Advertisement -
- Advertisement -

సిఎం రేవంత్ కీలక ఆదేశాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : న్యూఇయర్ ప్రారంభ నెల జనవరిలో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సిఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. గురువారం హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, ప్రభుత్వ ముఖ్య అధికారులతో హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డి)లో సంబంధిత అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో నూతన భవనాన్ని నిర్మించాల్సిన అవశ్యకతను చీఫ్ జస్టిస్, న్యాయ వాదులు ఈ సందర్భంగా సిఎం రేవంత్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ పరిధిలో 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని సిఎం రేవంత్‌ను కోరారు.

ఈ విషయమై సిఎం సానుకూలంగా స్పందించారు. సంబంధిత ఏర్పా ట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధం గా కొత్త జిల్లాల్లో కోర్టు కాంప్లెక్స్ ల నిర్మాణానికి కూడా చొరవ వహించాలని చీఫ్ జస్టిస్, న్యాయవాదులు సిఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడున్న హైకోర్టు భవనం హెరిటెజ్ బిల్డింగ్ కాబట్టి దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని కూడా గుర్తు చేశారు. ఆ భవనాన్ని రినోవేషన్ చేసి సిటి కోర్టుకు లేదా ఇతర కోర్టు భవనాలకు వినియోగించుకునేలా చూస్తామని రేవంత్ హామీ ఇచ్చా రు. ఈ సమీక్ష సమావేశంలో సిఎస్ శాంతి కుమారి, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఐఎఎస్ అధికారి నవీన్ మిట్టల్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News