Saturday, April 27, 2024

కొత్త ఆదాయ పన్ను నిబంధనలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గతేడాది (2023) బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్నుకు సంబంధించిన అనేక నియమాలలో మార్పులు చేసింది. ఇది 2024 సంవత్సరంలో పన్ను చెల్లింపుదారులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి ప్రయత్నించారు. దీంతోపాటు ఆదాయపు పన్ను శాఖ అనేక మార్పులు చేయగా, ఇవి 2024 సంవత్సరంలో సామాన్య ప్రజలపై ప్రత్యక్ష ప్రభావం చూపబోతున్నాయి.

ప్రభుత్వం 2023 మార్చిలో ఈ డిఫాల్ట్ పన్ను విధానాన్ని రూపొందించింది. పన్ను చెల్లింపుదారుడు తనంతట తానుగా ఏదైనా పన్ను విధానాన్ని ఎంచుకోకపోతే, మొదటి పన్ను విధానం ప్రకారం టిడిఎస్ తీసివేస్తారని ఆర్థిక మంత్రి ప్రకటించారు. పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే మాత్రమే మీ పన్ను ఆ విధానం ప్రకారం లెక్కిస్తుంది. కొత్త పన్ను విధానంలో ప్రాథమిక మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెరిగింది. మీరు కొత్త పన్ను విధానంలో మొత్తం రూ.7.5 లక్షల వరకు రాయితీని పొందుతారు. ఈ ఏడాది వచ్చే మార్పులను తెలుసుకుందాం.

డెట్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు రూల్స్
కొత్త సంవత్సరం ఆదాయపు పన్ను శాఖ డెట్ ఫండ్ పెట్టుబడిదారులకు షాక్ ఇచ్చింది. దీర్ఘకాలిక మూలధన లాభం(ఎల్‌టిసిజి)పై పన్ను మినహాయింపును తొలగించింది. దీంతో దీర్ఘకాలిక మూలధన లాభం ద్వారా సంపాదించిన ఆదాయం ఇప్పుడు ఆదాయంగా పరిగణిస్తారు. ఈ ఆదాయంపై పన్ను స్లాబ్ ప్రకారం టాక్స్ చెల్లించాలి. ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చింది. ఈ సంవత్సరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ. 5 కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ప్రజలకు పెద్ద ఊరటనిచ్చారు. సర్‌చార్జ్ రేటులో 37 శాతం నుంచి 25 శాతానికి పెద్ద కోత పెట్టారు. దీంతో అధిక నికర వ్యక్తులపై సగటు పన్ను 42.74 శాతం నుండి 39 శాతానికి తగ్గింది.

జీవిత బీమా మొత్తంపై పన్ను
జీవిత బీమా పాలసీ మెచ్యూరిటీ మొత్తంపై పన్ను నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఇంతకుముందు ఈ మొత్తం పూర్తిగా పన్ను రహితంగా ఉండేది, కానీ ఇప్పుడు పన్ను చెల్లింపుదారులు రూ. 5 లక్షల కంటే ఎక్కువ ప్రీమియంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఆస్తి అమ్మకంపై మూలధన లాభాలు-
కేంద్ర ప్రభుత్వం ఆస్తుల విక్రయం ద్వారా వచ్చే ఆదాయంపై మినహాయింపు పరిమితిని రూ.10 కోట్లుగా నిర్ణయించింది. దీంతో పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను సెక్షన్లు 54, 54ఎఫ్ కింద రెసిడెన్షియల్ ప్రాపర్టీ నుండి వచ్చే ఆదాయంపై రూ. 10 కోట్ల వరకు ఆదాయాన్ని క్లెయిమ్ చేయవచ్చు.

పాత ఐటీ రిటర్న్‌లను తొలగించవచ్చు
ఐటి శాఖ పన్ను చెల్లింపుదారులకు పాత సంవత్సరాల పరిశీలించని ఐటి రిటర్న్‌లను తొలగించే సదుపాయాన్ని అందిస్తుంది. ఈ పరిస్థితిలో ధృవీకరణ పూర్తికాని మునుపటి సంవత్సరాల ఐటి రిటర్న్‌లను మీరు సులభంగా తొలగించవచ్చు.

ఆన్‌లైన్ గేమింగ్‌పై 30 శాతం పన్ను
ఈ ఏడాది ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా వచ్చే ఆదాయాలపై 30 శాతం పన్ను విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిబంధన 2023 మార్చి 31 నుండి అమలులోకి వచ్చింది. గతంలో రూ.10,000 కంటే ఎక్కువ వార్షికాదాయంపై టిడిఎస్ విధించగా, ఇప్పుడు దాన్ని 30 శాతానికి పెంచారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News