Friday, April 26, 2024

రంగారెడ్డిలో నవవధువు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

newly-married woman commits suicide in Ranga Reddy

మంచాల: రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం చీదేడులో గురువారం విషాదం చోటుచేసుకుంది. ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. అత్తారింట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మృతిరాలిని గౌతమి(21)గా గుర్తించారు. ఆమెకు14 రోజుల క్రితమే వివాహం జరిగింది. అదనపు కట్నం కోసం భర్త వేధించినట్టు బంధువులు ఆరోపిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం మృతురాలి భర్త, అత్తామామలపై అరెస్ట్ చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

newly-married woman commits suicide in Ranga Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News