- Advertisement -
ముంబయి : భీమా కొరేగావ్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఎ) శుక్రవారం 8 మందిపై చార్జిషీట్ దాఖలు చేసింది. 2018 జనవరి 1న భీమా కొరేగావ్లో హింసకు ప్రేరేపించారన్న అభియోగాలపై సామాజిక కార్యకర్త గౌతమ్ నవలఖా, ఢిల్లీ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ హనీ బాబు, గిరిజన నాయకుడు ఫాదర్ స్టాన్ స్వామితో సహా 8 మందిపై ఇక్కడి ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు ఎన్ఐఎ ప్రతినిధి, డిఐజి సోనియా నారంగ్ శుక్రవారం తెలిపారు. ఈ 8 మంది ఇప్పటికే అరెస్టయ్యారు. ఎన్ఐఎ చార్జిషీట్లో నిందితులుగా ఉన్న వారిలో గోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డే, భీమా కొరేగావ్ శౌర్య దిన్ ప్రేరణ అభియాన్ గ్రూప్ కార్యకర్తలు జ్యోతి జగతప్, సాగర్ గోర్ఖె, రమేశ్ గచర్ ఉన్నారు.
- Advertisement -