యంగ్ హీరో నితిన్ ‘భీష్మ’ సక్సెస్ జోష్ లో మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. బాలీవుడ్ చిత్రం ‘అంధదున్’కి ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ నిర్మస్తుంది. తాజాగా ఈ మూవీ ప్రారంభోత్సవం కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ప్రముఖ నిర్మాతలు శ్యాంప్రసాద్ రెడ్డి, దిల్ రాజు, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), దర్శకుడు సురేందర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి శ్యాంప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టగా, స్టార్ ప్రడ్యూసర్ దిల్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. స్క్రిప్ట్ను నిర్మాత ఎస్.రాధాకృష్ణ చిత్ర యూనిట్కు అందజేశారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభమవుతుందని చిత్ర యూనిట్ వెల్లడించింది.
కాగా, గత శుక్రవారం విడుదలై నితిన్ ‘భీష్మ’ టాలీవుడ్ భాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీ నితిన్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నితిన్ సరసన యంగ్ బ్యూటీ రష్మిక మందన నటించింది.
Glad to announce our next production, a remake of #Andhadhun. Featuring @actor_nithiin and directed by @MerlapakaG. Glimpses from the official launch today!
Bankrolled by #SudhakarReddy & #NikithaReddy. Presented by #BMadhu.
More details soon!! #ProductionNo6 pic.twitter.com/rzpiARQl8J
— Sreshth Movies (@SreshthMovies) February 24, 2020
Nithin and MerlaPaka Gandhi Movies begins today