Sunday, April 28, 2024

ఆ కార్లను దేశంలోకి అనుమతించబోం: గడ్కరీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశం లోని డ్రైవర్ల ఉద్యోగాల భద్రత దృష్టా డ్రైవర్‌లెస్ కార్లను దేశం లోకి ఎప్పటికీ అనుమతించబోమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఐఐఎం నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి గడ్కరీ రోడ్డు భద్రతా సమస్యలపై మాట్లాడారు. ఈ సందర్భంగా డ్రైవర్‌లెస్ కార్లను దేశం లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. అదే విధంగా కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల ఏర్పాటు, రోడ్లపై బ్లాక్ స్పాట్‌ల తొలగింపు , వంటి చర్యలతో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించామని చెప్పారు.

ప్రజామౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. హైడ్రొజన్‌ను భవిష్యత్తు ఇంధనంగా గడ్కరీ అభివర్ణించారు. ఇటీవల పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో గడ్కరీ మాట్లాడుతూ , జాతీయ రహదారులపై మూలధన వ్యయం 201314లో రూ. 51 వేల కోట్లు ఉండగా, 202223లో రూ.2.40 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. 201314 లో రోడ్డు రవాణా మంత్రిత్వశాఖకు బడ్జెట్ కేటాయింపులు రూ. 31, 130 కోట్లు కాగా, 202324 నాటికి ఇది రూ.2,70, 435 కోట్లకు పెరిగిందని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News