లండన్: ఇంగ్లండ్తో ఇప్పటికే మూడు టెస్టులు పూర్తయిన తెలుగుతేజం హనుమ విహారికి ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం దక్కడం లేదు. వరుస వైఫల్యాలు చవిచూస్తున్న సీనియర్లు అజింక్య రహానె, చటేశ్వర్ పుజారాలను తప్పించి విహారికి తుది జట్టులో స్థానం కల్పించాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్న కెప్టెన్కానీ, కోచ్కానీ ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. విహారిలో అపార ప్రతిభ దాగివున్నా సీనియర్ల కారణంగా అతనికి తుది జట్టులో అవకాశం లేకుండా పోతోంది. కనీసం నాలుగో టెస్టులోనైనా అతనికి ఛాన్స్ దొరుకుతుందా అనేది సందేహమే. పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే విహారికి మరోసారి నిరాశే మిగలడం ఖాయంగా కనిపిస్తోంది. వైస్ కెప్టెన్ రహానెను తప్పించి విహారికి తుది జట్టులో చోటు కల్పిస్తారని ఆశించడం అత్యాశే అవుతోంది. అంతేగాక ఒకవేళ తీసుకున్నా సూర్యకుమార్కే జట్టులోకి వచ్చే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. అయితే కెప్టెన్ కోహ్లి ఆలోచన మరో విధంగా ఉంది. సీనియర్లు పుజారా, రహానెలకే అతను తుది జట్టులో అవకాశం ఇవ్వడం ఖాయమని చెప్పాలి. దీంతో విహారి మరోసారి పెవిలియన్కే పరిమితం కాక తప్పక పోవచ్చు.
No chance to Hanuma Vihari in 4th test against Eng