Monday, April 29, 2024

మాస్క్ పెట్టుకోలేదని ఆర్మీ జ‌వాన్‌ను చితకబాదిన పోలీసులు..

- Advertisement -
- Advertisement -

రాంఛీ: మాస్క్ పెట్టుకోలేదని ఓ ఆర్మీ జ‌వాన్‌ను పోలీసులు చితకబాదారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని ఛాత్రా జిల్లాలో జ‌రిగింది. వివరాల్లోకి వెళితే.. ఛాత్రాలోని క‌ర్మా బ‌జార్ ప్రాంతంలో కొంద‌రు పోలీసులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వ‌హించారు. అదే స‌మ‌యంలో బైక్‌పై వ‌చ్చిన ఆర్మీ జ‌వాన్ ప‌వ‌న్ కుమార్ యాద‌వ్‌ను మాస్క్ పెట్టుకోలేదని అడ్డుకుని బైక్ తాళాలు లాక్కున్నారు. దీంతో పోలీసులు, జ‌వాన్ మ‌ధ్య వాగ్వాదం చేటుచేసుకుంది. పోలీసులు రౌండ‌ప్ చేసి జ‌వాన్‌ను కిందపడేసి కాళ్ళతో తన్నుతూ చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు జ‌వాన్‌పై దాడి చేసిన పోలీసులను విధుల నుంచి తొల‌గించారు.

Jharkhand Cops brutally beat Army Jawan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News