- Advertisement -
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఎటువంటి ఉద్రిక్తత లేదని ఈస్ట్ జోన్ డిసిపి రమేష్ తెలిపారు. ఓయు దగ్గర జరుగుతున్న కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోందన్నారు. ఒయులో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలేదని, ఉద్రిక్తంగా ఉందంటూ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని సూచించారు. భయబ్రాంతులను చేసే ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దన్నారు. ఒయుకు వెళ్లకుండా తాము ఇంతవరకు ఎవరిని ఆపలేదన్నారు. ప్రస్తుతం ఎటువంటి శాంతిభద్రతల సమస్యలేదన్నారు.
- Advertisement -