Sunday, May 5, 2024

చిల్లర నాణేలతో నామినేషన్… తిరస్కరించిన రిటర్నింగ్ అధికారి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: బహుజన ముక్తి పార్టీ అభ్యర్థి చంద్రకాంత్ మంగళవారం… జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రూ. 10 నాణేలతో నామినేషన్ దాఖలు చేసేందుకు ప్రయత్నించారు. కానీ రిటర్నింగ్ అధికారులు ఆ చిల్లర తీసుకోవడానికి నిరాకరించడంతో ఆ తర్వాత నోట్ల రూపంలో రూ. 5000 చెల్లించి నామినేషన్ దాఖలు చేశారు.

నామినేషన్ దాఖలు అనంతరం ఆయన మాట్లాడుతూ… దేశంలో, రాష్ట్రంలో చిల్లర రాజకీయాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందనే ఉద్దేశ్యంతోనే తాను చిల్లరను జమ చేసుకొని, నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చానన్నారు. మంచి రాజకీయాలను బలపరచాలన్నారు.ప్రజలకు మేలు చేసే వారినే అసెంబ్లీకి పంపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ నాణేలను చాలాకాలంగా తాను కూడబెట్టానని, కానీ రిటర్నింగ్ అధికారి తిరస్కరించారని తెలిపారు. తాను తెచ్చిన నాణేలు ఆర్బీఐ ముద్రించిన నాణేలే అన్నారు. కానీ వాటిని తీసుకొని ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News