Sunday, April 28, 2024

రేపు ఎంఎల్‌సి ఎన్నికలకు నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

రేపు ఎంఎల్‌సి ఎన్నికలకు నోటిఫికేషన్
23 వరకు నామినేషన్ల స్వీకరణ… మార్చి 14న ఎన్నికలు

notification for MLC Elections on Feb 16 in Telangana

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో ఖమ్మం-వరంగల్-నల్గొండ, మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ప ట్టభద్రుల స్థానాలకు మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. మార్చి 14వ తేదీన పోలింగ్ జరుగనున్న గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఎన్నికలకు మంగళవారం నుంచి ఈ నెల 23 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మార్చి 24న నామినేషన్లను పరిశీలించనుండగా, నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 26వ తేదీ వరకు గడువు ఉంది. మార్చి 14వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుండగా, మార్చి 17 ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రస్తుతం పట్టభద్రుల నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంఎల్‌సిలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎన్.రామచంద్రరావుల పదవీకాలం మార్చి 29వ తేదీతో పూర్తికానుంది.

notification for MLC Elections on Feb 16 in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News