Saturday, April 27, 2024

ఒడిశా మంత్రి పై కాల్పులు..

- Advertisement -
- Advertisement -

ఒడిశా: ఒడిశా మంత్రి నవకిశోర్ దాస్ పై ఏఎస్ఐ కాల్పులు జరిపిన సంఘటన ఝార్సిగూడ జిల్లా బ్రజరాజనగర్ లో చోటు చేసుకుంది . వివరాలలోకి వెళితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైద్యశాఖ మంత్రిపై ఏఎస్ఐ గోపాల్ డాస్ రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మంత్రి తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన మంత్రిని పోలీసులు ఎయిర్ లిఫ్ట్ ద్వారా భువనేశ్వర్ తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మంత్రి పరిస్తితి విషమంగా ఉన్నట్లు సమాచారం.. మంత్రిపై కాల్పులు జరిపిన ఏఎస్ఐ గోపాల్ దాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News