Saturday, May 4, 2024

ఒడిశాలో పాత్రికేయుడికి ఆసుపత్రి పడకకు బేడీలు

- Advertisement -
- Advertisement -

Odisha journalist cuffed to bed
భువనేశ్వర్:  లోక్‌నాథ్ దాలీ బాలాసోర్(ఒడిశా)కు చెందిన జర్నలిస్టు. జిల్లాలోని నీల్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో అవినీతికి సంబంధించిన వార్తను ప్రచురించినందుకు పోలీసులు స్టేషన్‌కు పిలిపించి కొట్టారు. ఇన్‌ఛార్జి ఇన్‌స్పెక్టర్ ద్రౌపది దాస్ కొట్టి పడేసిందని, తన ఫోనును కూడా స్టేషన్‌లో కాజేశారని అతడు అంటున్నాడు. ఇన్‌స్పెక్టర్ తనని కొట్టగానే తాను స్పృహతప్పి పడిపోయానని, తనని ఆసుపత్రిలో చేర్చారని, కానీ ఆసుపత్రిలో కూడా పడక మంచానికి తనను బేడీలతో బంధించారని తెలిపాడు. ఇదిలావుండగా ఈ వ్యవహారంపై ఒడిశా పోలీస్ డిజిపి దర్యాప్తునకు ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News