Monday, April 29, 2024

ఒడిశాలో రోడ్డు ప్రమాదం: ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం కేంఝహార్ జిల్లాలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బాలిజోడి వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News