- Advertisement -
హైదరాబాద్ః నగరంలోని వనస్థలిపురం పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. తుర్కయంజాల్ లోని రొక్కం సత్తి రెడ్డి గార్డెన్స్ వద్ద ఆటో బోల్తా పడిన ఘటనలో వ్యక్తి ఓ మృతి చెందగా.. మరోకరికి తీవ్రగాయాలయ్యాయి.ఈ ఘటనకు అతివేగమే కారణమని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. సోమాజిగూడలోనూ గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజ్భవన్కు వెళ్లే దారిలో ఓ కారు అదుపుతప్పి దర్గాను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా, మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
One Died in Road Accident at Vanasthalipuram
- Advertisement -