Friday, April 26, 2024

రైళ్లో నుంచి కిందపడి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

One member dead from moving train

మనతెలంగాణ/సిర్పూర్ టి: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి సమీపంలోని రైలు పట్టాల మధ్య బల్లార్ష నుంచి మంచిర్యాల వైపు వెళ్లే  రైలు నుండి ప్రమాదవశాత్తుపడి ఒకరు మృతి చెందారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బల్లార్షా నుండి మంచిర్యాల వైపు వెళ్లే  రైలు నుంచి రాజారామ్ (24) అనే వ్యక్తి పడి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి జేబులో తేది 30.06.2021 రోజున గోరక్‌పూర్ నుండి నాగపూర్ వరకు అన్‌లైన్ రైల్వే టికెట్ ఉంది. అతని పేరు రాజారామ్ అని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని హెడ్ కానిస్టేబుల్ సురేష్ గౌడ్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News