రెండు వాహనాలు ఢీకొని ఒకరు మృతి..
ముగ్గురికి తీవ్ర గాయాలు..
వాహనంలోనే ఇరుక్కుపోయిన మృతదేహం, క్షత గాత్రులు..
జెసిబి సహాయంతో బయటకు తీసిన స్థానికులు, పోలీసులు..
షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని కొందుర్గు మండల పరిధిలోని శ్రీరంగాపూర్ గ్రామం వద్ద శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. షాద్ నగర్ నుండి పరిగి వైపు వెళ్తున్న బొలెరో వాహనం పరిగి వైపు నుండి షాద్ నగర్ వస్తున్న టాటా ఎసి వాహనం ఓవర్ స్పీడ్ తో ఒక దానికి మరొకటి ఢీకొనడంతో అక్కడికక్కడే ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు చటన్ పల్లికి చెందిన వెంకటయ్యగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ముగ్గురికి కాళ్లు చేతులు విరిగి తీవ్రగాయాలయినట్టు సమాచారం. వీరు వాహనంలోనే ఇరుక్కుపోయారు సుమారు రెండు గంటలపాటు 20 మంది ప్రయత్నించినప్పటికి బయటకు తీయలేకపోయారు. జెసిబి సహాయంతో వీరిని బయటకు తీసిన అనంతరం గాయపడినవారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..