మనతెలంగాణ/చేగుంట: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 10 మంది గాయపడిన సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజిపేట పంచాయితీ పరిదిలోని రాయన్చెరువు తండా రోడ్డు వద్ద చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం……. చేగుంట నుండి గజ్వేల్ వెలుతున్న కారు (ఎంఎచ్31సిఎస్ 7837) నర్సంపల్లి గ్రామంలో విందు భోజనం చేసుకుని గోడుగుపల్లికి వస్తున్న అటోను రాయన్చెరువు తండా వద్ద ఢీకొట్టగా సూరంపల్లి ప్రశాంత్ (19) తండ్రి దేవయ్య మృతి చెందగా మరో 9 మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఆటోలో ప్రయాణిస్తున్న గాయాలైన వారిలో గోడుగుపల్లి గ్రామానికి చెందిన సూరంపల్లి సిద్దయ్య, సూరంపల్లి నర్సవ్వ, సూరంపల్లి రవి, చందాయిపేటకు చెందిన గడ్డమీద సుకన్య, కన్యారంకు చెందిన పట్నం నవ్య, వడియారం గ్రామానికి చెందిన నిమ్మెల్ల్లి స్వామి, నిమ్మెల్లి మల్లమ్మ , మాచినిపల్లి గ్రామానికి చెందిన పోట్టల్ల సురేష్, తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన కుకునూర్ స్వామిలకు తీవ్ర గాయాలైనాయి. వీరందరిని గాంధీ ఆసుపత్రి, గజ్వేల్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చేగుంట పోలీసులు తెలిపారు.