- Advertisement -
మన తెలంగాణ/వనపర్తి: గర్భిణికి పురటి నొప్పులు రావడంతో 108 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి వస్తుండగా మార్గమధ్యలో 108 అంబులెన్స్ వాహనంలో గర్భవతి ప్రసవించిన సంఘటన వనపర్తి జిల్లా పానగల్ మండలంలో చోటుచేసుకుంది. మంగళవారం శాఖాపూర్ గ్రామానికి చెందిన సుమిత్ర అనే గర్భిణీకి పురటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ వాహనానికి ఫోన్ చేశారు. శాఖాపూర్ నుండి పాన్ గల్ ప్రభుత్వ ఆస్పత్రికి వస్తుండగా మార్గమద్యలో నొప్పులు ఎక్కువ కావడంతో 108 అంబులెన్స్ టెక్నీషియన్ విష్ణు చాకచక్యంగా వ్యవహరించి గర్భవతికి సాధారణ ప్రసవం చేయడంతో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే పిహెచ్సి కేంద్రానికి తీసుకొచ్చారు. డా. రాముడు తల్లిబిడ్డలకు వైద్య పరీక్షలు చేశారు. ఇద్దరు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. అంబులెన్స్ టెక్నీషియన్ విష్ణు, పైలెట్ నరేష్లను డా. రాముడు అభినందించారు.
Women give birth baby in 108 Vehicle
- Advertisement -