Monday, April 29, 2024

ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి:శ్రీలక్ష్మీనరసింహ స్వామి యాదాద్రి క్షేత్రంలో అండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ మహోత్సవాన్ని ఆలయ అర్చకులు వేడుకగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ప్రీ తికరమైన రోజు కావడంతో ఉదయం అభిషేకం, సాయంత్రం ఆ లయ మండపంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఊంజల్ సేవ మహోత్సవాన్ని నిర్వహించారు.

అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేసిన అర్చకులు మేళతాళాలు, మంత్రోచ్ఛరణ గావిస్తూ అమ్మవారి సేవను ఆలయ పురవీధులలో ఊరేగించారు. అద్దాల మండపములో అమ్మవారి సేవను వేచింప చేసి ఊంజల్ సేవ ప్రత్యేకతను భక్తులకు అర్చకులు వివరించారు. భక్తజనులు స్వామి అమ్మవారిని దర్శించుకొని తరించారు.

శ్రీవారి నిత్యరాబడి..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిత్యరాబడిలో భాగ ంగా శుక్రవారం రూ.12,70,012 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.88,000, బ్రేక్ దర్శనం ద్వారా రూ.80,100, వ్రత పూజల ద్వారా రూ.47,200, వీఐపీ దర్శనాల ద్వారా రూ.60,000, కొండపైకి వాహనాల ప్రవే శం ద్వారా రూ.1,50,000, ప్రసాద విక్రయం ద్వారా రూ.6 ,08,980తో పాటు తదితర శాఖలు, పాతగుట్ట ఆలయం నుంచి ఆ దాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

శ్రీవారిని దర్శించుకున్న మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ జనరల్ సంజయ్
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ జనరల్ సంజయ్. శుక్రవారం స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన సంజయ్‌కి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News