- Advertisement -
న్యూఢిల్లీ: బడ్జెట్ ప్రవేశ పెట్టిన తరువాత బడ్జెట్ ప్రధాన అంశాలపై పార్లమెంటు సమావేశాల్లోచర్చించడానికి అనుసరించే వ్యూహంపై ఫిబ్రవరి 1 న విపక్షాలు సమావేశం కానున్నాయి. పార్లమెంటు సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. వివిధ పార్టీలు బడ్జెట్పై చర్చించడానికి విడివిడిగా తమ వ్యూహాలు సిద్ధం చేసుకున్నా సామాన్య ప్రజలకు సంబంధించిన కీలక ఆంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించనున్నాయి. సిఎఎపై ఆందోళనలు, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, ఆర్థిక దుస్థితి, నిరుద్యోగం పెరుగుదల వీటన్నిటిపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయనున్నాయి.
Opposition parties to meet on February 1
- Advertisement -