బ్రాసెల్ : భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ప్రతిష్టాత్మకమైన స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఫైనల్కు చేరుకుంది. సింధు ఓ టోర్నమెంట్ ఫైనల్కు చేరడం 2019 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు డెన్మార్క్కు చెందిన మిగా బ్లిచ్ఫెల్డ్ను ఓడించింది. ఆసక్తికంగా సాగిన సెమీస్ పోరులో సింధు 2220, 2110 తేడాతో నాలుగో సీడ్ బ్లిచ్ఫెల్డ్పై విజయం సాధించింది. తొలి సెట్లో పోరు ఆసక్తికరంగా సాగింది. ఇద్దరు ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా పోరాడారు. దీంతో టైబ్రేకర్ తప్పలేదు. ఇందులో పైచేయి సాధించిన సింధు గేమ్ను దక్కించుకుంది. అయితే రెండో గేమ్లో మాత్రం సింధుకు ఎదురే లేకుండా పోయింది. ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించిన సింధును అలవోకగా సెట్ను గెలిచి ఫైనల్కు చేరుకుంది. కాగా, పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్ సెమీస్లోనే ఇంటిదారి పట్టాడు. డెన్మార్క్ షట్లర్ విక్టర్ అక్సల్సెన్తో జరిగిన మ్యాచ్లో శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు.
ఫైనల్లో సింధు
- Advertisement -
- Advertisement -
- Advertisement -