Monday, May 6, 2024

అన్నా డిఎంకె సిఎం అభ్యర్థిగా పళనిస్వామి

- Advertisement -
- Advertisement -

Palaniswami as Anna DMK CM candidate

చెన్నై: ఎఐఎడిఎంకెలో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఇ.పళనిస్వామికి మరో అవకాశం దక్కింది. వచ్చే ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయణ్నే ఆ పార్టీ నిర్ణయించింది. బుధవారం జరిగిన 11మందితో కూడిన ఆ పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో పళనిస్వామి అభ్యర్థిత్వాన్ని ఉపముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వం ప్రతిపాదించారు. పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతను పన్నీర్‌సెల్వంకు అప్పగించారు. అవినీతి కేసులో జైలుపాలైన వికె శశికళ వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానున్నారన్న నేపథ్యంలో పార్టీలో చీలిక రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా భావిస్తున్నారు. శశికళను ఎఐఎడిఎంకె అధ్యక్ష పదవి నుంచి తొలగించడంలో వీరిద్దరు నేతలూ కీలక పాత్ర వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News