Friday, May 10, 2024

చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కళ్యాణ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణంగా హత్యకు గురైన చిన్నారి చెైత్ర కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి పరామర్శించారు. సింగరేణి కాలనీకి పవన్ వస్తున్నట్లు తెలుసుకున్న ఆయన అభిమానులు పెద్ద ఎత్తున భారీగా తరలి వచ్చారు. దీంతో పవన్ కారు దిగి ముందుకు కదలలేని పరిస్థితి రావడంతో బాధిత బాలిక తండ్రి, పవన్ కళ్యాణ్ కారు వద్దకే వెళ్లి కలిశారు. కాసేపు అతనితో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం బాధిత కుటుంబానికి భరోసా కల్పించాలని, వారికి అండగా నిలవాలన్నారు. వారికి న్యాయం జరిగే వరకు జనసేన అండగా ఉంటుందని చెప్పారు.

Pawan Kalyan visits girl chaitra family in Singareni Colony

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News