Wednesday, May 1, 2024

డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురిపై పిడి యాక్ట్

- Advertisement -
- Advertisement -

PD Act on four selling drugs

ఉత్తర్వులు జారీ చేసిన హైదరాబాద్ సిపి అంజనీకుమార్

మనతెలంగాణ, హైదరాబాద్ : డ్రైవర్లుగా పనిచేస్తూ డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు నిందితులపై పిడి యాక్ట్ పెడుతూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన మహ్మద్ ఫిరోజ్ , హాజార్ అలీ, మజీర్ వలీ, షేక్‌ఆరిప్ పాషా డ్రగ్స్ రవాణా చేస్తున్నారు. నలుగురు కలిసి నగరంలోని వివిధ ప్రాంతాలకు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారు. మొబైల్ ఫోన్లను వాడుతూ పోలీసుల నుంచి తప్పించుకుని డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారు. నలుగురు డ్రైవర్లు కావడంతో సులభంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రవాణా చేస్తున్నారు. డ్రగ్స్ వల్ల చాలామంది యువత ఆరోగ్యం జీవితాలు నాశనం అవుతున్నాయి. నిందితులను గతంలో అరెస్టు చేసిన చాంద్రాయణగుట్ట పోలీసులు రిమాండ్‌కు తరలించారు. తాజాగా వారిపై పిడి యాక్ట్ పెడుతూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆదేశాలు జారీ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News