Friday, April 26, 2024

భార్య చూస్తుండగానే.. భర్త గొంతు కోసిన దుండగులు…

- Advertisement -
- Advertisement -

Murder

దుమ్ముగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని  దుమ్ముగూడెం మండలం, లచ్చిగూడెం గ్రామంలో ఆదివారం అర్థరాత్రి దారుణం చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఓ వ్యక్తి గొంతుకోసి హత్యచేశారు. వివరాల్లోకి వెళితే… రామకృష్ణ అనే వ్యక్తిని, భార్య చూస్తుండగానే దుండగులు ఆయన గొంతు కోసి అక్కడి నుంచి పారిపోయారు. మృతుడి భార్య బోరున విలపించడంతో విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. రామకృష్ణ దుమ్ముగూడెం ఎంఇఒ కార్యాలయంలో సీఆర్పీగా విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఈ హత్యకు భూతగాదాలే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.

Person Brutally Murdered in Khammam district

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News