మనతెలంగాణ/హైదరాబాద్ : వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న దిశ చిత్రాన్ని నిలిపివేయాలంటూ దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి మంగళవారం నాడు హైకోర్టులో రిట్ అప్పీల్ పిటీషన్ దాఖలు చేశారు. రామ్గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న దిశ ఎన్కౌంటర్ చిత్రాన్ని వెంటనే నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు డివిజన్ బెంచ్లో పిటిషన్ వేశారు. కాగా ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్పై సోషల్ మీడియాలో అసభ్యకరంగా మెసేజ్లు పెడుతున్నారని, వాటిని తొలగించాలంటూ దిశ తండ్రి సిసిఎస్లో ఫిర్యాదు చేసిన విషయం విదితమే. అదేవిధంగా యూట్యూబ్లో అసభ్యంగా మెసేజ్లు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ నెల 26న సినిమా విడుదల కాకుండా ఆపాలని పిటిషన్ వేశారు. ఇదిలావుండగా దిశ ఎన్కౌంటర్ నిందితుల కుటుంబ సభ్యులు సైతం చిత్ర నిలిపివేయాలంటూ జ్యుడీషియల్ కమిషన్ను కలిసి వినపతి పత్రంల సమర్పించారు.