25 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు
నోటిఫికేషన్ విడుదల చేసిన కాళోజీ హెల్త్ వర్సిటీ
మనతెలంగాణ/హైదరాబాద్ : కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఈ నెల 18 నుంచి మెడికల్, డెంటల్ పిజి సీట్ల ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుందని వర్సిటీ వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్లో అర్హులైన అభ్యర్థులు ఈ నెల 18 నుంచి 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ అధికారులు తెలిపారు. నిర్ధేశిత ధరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. గతంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్కి అభ్యర్థులు రావాల్సి ఉండేది, కానీ ప్రస్తుతం కరోనా వైరస్ దృష్ట్యా ఈ ఏడాది రిజిస్ట్రేషన్ సమయంలోనే సంబంధించిన అన్ని ధ్రువపత్రాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని, ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలని అన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం తర్వాత నోటిఫికేషన్ ఇవ్వబడదు అని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఆన్లైన్ లో సమర్పించిన దరఖాస్తులు , సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితా విడుదల చేస్తారు. మరిన్ని వివరాలల కోసం అభ్యర్థులు కాళోజీ విశ్వవిద్యాలయం వెబ్సైట్ www.knruhs.telangana.gov.inను సంప్రదించవచ్చు.