- Advertisement -
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లో 4జీ ఇంటర్నెట్ సేవలు పునరుద్దరించాలని వేసిన పిటిషన్ పై గురువారం సుప్రీం కోర్టులో విచరాణ జరింగింది. 4జీ ఇంటర్నెట్ లేకపోవడంతో పలు సేవలు అందట్లేదని పిటిషనర్ తరుఫున న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. విద్యార్థుల ఆన్ లైన్ తరగతుల కోసం 4జీ ఇంటర్నెట్ సేవలు అవసరమని పేర్కొన్నారు. ఈ కేసులో పూర్తి వాదనలు విన్న జస్టిస్ ఎల్. వి.రమణ, జస్టీస్ సుభాష్ రెడ్డి, జస్టీస్ బిఆర్.గవాయ్ తో కూడిన ధర్మాసనం.. జమ్మూకశ్మీర్ స్టాండింగ్ కౌన్సిల్ కు నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
Plea filed in SC to Restore 4G Services in Jammu Kashmir
- Advertisement -