- Advertisement -
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బాతో ఫోన్లో మాట్లాడారు. రెండు దేశాల మధ్య విస్తృత స్థాయిలో సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి తామిద్దరం కలసికట్టుగా కృషిచేద్దామని ప్రధాని మోడీ ఆయనతో అన్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలను నివారించే ఉద్దేశంతో పునరుద్ధరించిన నేపాల్ దిగువ సభలో ఇటీవల విశ్వాస పరీక్షలో నెగ్గిన నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు 75 ఏళ్ల దేవ్బా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన దరిమిలా ఆయనతో మోడీ చర్చలు జరిపారు. నేపాల్ ప్రధానిగా ఇటీవలే నియమితులైన షేర్ బహదూర్ దేవ్బాతో తాను మాట్లాడి శుభాకాంక్షలు, అభినందనలు తెలియచేశానని మోడీ ట్వీట్ చేశారు.
PM Modi Congratulates Nepal PM on Phone
- Advertisement -