- Advertisement -
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తన ఆస్తుల, అప్పుల వివరాలను వెల్లడించారు. గత పదిహేను నెలల కాలంలో ఆయన చరాస్తులు రూ. 36,53,000లు పెరిగాయి. ఈ ఏడాది జూన్ 30 నాటికి ఆయన చరాస్తులు విలువ కోటి 75లక్షల 63వేల రూపాయాలకు పెరిగింది. స్థిరాస్తిలో ఎలాంటి మార్పులేదు. ప్రధాని మోడీ చేతిలో రూ. 31వేల 450 నగదు మాత్రమే ఉంది. సగటు మధ్యతరగతి వ్యక్తిలా ఆలోచిస్తున్న ప్రధాని తన జీతంలో ఎక్కువ భాగాన్ని బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్లకే కేటాయిస్తున్నారు. పొదుపు విషయంలో మోడీ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కుటుంబంతో కలిపి ఆయనకు గాంధీనగర్ లో ఇల్లు, స్థలం ఉన్నాయి. ప్రధాని ఎక్కువగా పన్ను మినహయింపు మార్గాలను ఎంచుకుంటున్నారు. అందుకు జీవిత బీమా, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ బాండ్లలో పెట్టుబడులు పెడుతున్నారని సన్నిహితులు చెబుతున్నారు.
PM Narendra Modi declared his assets
- Advertisement -