Saturday, April 27, 2024

విజయవాడలో భారీగా బంగారం పట్టివేత…

- Advertisement -
- Advertisement -

Gold

అమరావతి: విజయవాడలో భారీగా బంగారం పట్టుబడింది. ముంబై నుంచి కార్గో కొరియన్ ద్వారా గురువారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న 20కేజీల బంగారాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిఎస్‌టి, ఇతర పన్నులు ఎగ్గొట్టి నగరంలోని బంగారు దుకాణాలకు ఈ ఆభరాలను సరాఫరా చేస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిఎస్‌టి అధికారుల సమక్షంలో కేసును టాక్స్ ఫోర్స్ బృందం విచారించనుంది. పట్టుబడిన బంగారం విలువ 17 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముగ్గురు నిందితుల దగ్గర అనధికారికంగా ఉన్న 10 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

Police Seized 20 Kgs Gold in Vijayawada

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News