- Advertisement -
పాట్నా : బీహార్లో మంగళవారం ఉదయం ఏడు గంటలకు రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. 94 అసెంబ్లీ స్థానాలలో 1500 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2.85 కోట్ల మంది ఓటర్లు ఇవాళ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గవర్నర్ ఫగ్ చౌహాన్, రాఘేవాపూర్ పోలింగ్ బూత్-2లో ఎల్జెపి చిరాగ్ పాశ్వాన్ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 41 వేల 362 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం కరోనా దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. రెండో విడత బరిలో ఆర్జెడి నేతలు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్లు ఉన్నారు.
- Advertisement -