Sunday, May 12, 2024

బిపిసిఎల్‌కు రూ.2 కోట్లు, ఐఓసీకి రూ.1 కోటి ఫైన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : తమ పెట్రోల్ పంపుల వద్ద కాలుష్య నియంత్రణ పరికరాలను ఏర్పాటు చేయనందుకు ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఓసి), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్)కు ’కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ’ జరిమానా విధించింది. ఐఓసికి రూ.1 కోటి, బిపిసిఎల్‌కు రూ.2 కోట్ల జరిమానా విధించినట్లు రెండు సంస్థలు వేర్వేరు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించాయి. ”నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్)లోని రిటైల్ అవుట్‌లెట్లలో ’ఆవిరి రికవరీ సిస్టమ్స్ (విఆర్‌ఎస్)ఇన్‌స్టాల్ చేయనందుకు కంపెనీ రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలని సిపిసిబి నుంచి ఆదేశాలు అందాయి” అని ఐఓసితెలిపింది.

అయితే, సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులోపు పెట్రోల్ స్టేషన్లలో విఆర్‌ఎస్‌లను ఏర్పాటు చేయనందుకు ఈ ఫైన్ విధించలేదని వెల్లడించింది.వాహనాల్లో ఇంధనం నింపేటప్పుడు పెట్రోల్ ఆవిరై వాతావరణంలోకి వెళుతుంది. ఈ ఆవిరిలో బెంజీన్, టోలీన్, క్సైలీన్ వంటి క్యాన్సర్ కారక పదార్థాలు ఉంటాయి. పెట్రోల్ ఆవిరి బయటకు రాకుండా ఇంధన స్టేషన్లలో విఆర్‌ఎస్‌ను అమర్చాలని 2016లో పెట్రోల్ పంపులకు ఆదేశాలు జారీ అయ్యాయి. సుప్రీంకోర్టు, సిపిసిబి నిర్దేశించిన సమయంలోవిఆర్‌ఎస్‌ను ఇన్‌స్టాల్ చేయనందుకు సిపిసిబికి రూ.2 కోట్లు పరిహారం చెల్లించాలని పర్యావరణ (రక్షణ) చట్టం, 1986లోని సెక్షన్ 5 కింద నోటీసు అందుకున్నట్లు బిపిసిఎల్ ఒక ప్రత్యేక ఫైలింగ్‌లో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News