Thursday, May 2, 2024

ఖననం చేసిన యువతి శవానికి పోస్టుమార్టం

- Advertisement -
- Advertisement -

Postmortem on funeral dead body in khammam

మన తెలంగాణ/మధిర : తన కూతు రు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో ఖననం చేసిన యువతి శవానికి పోస్టుమార్టం నిర్వహించిన సంఘటన ఖమ్మం జిల్లాలోని మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మడుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన సూర్యప్రకాశరావు కూతురు పూజిత(19) ఫిబ్రవరి 27న అనారోగ్యం కారణంగా మృతి చెందగా బంధువులు 28వ తేదీన అంత్యక్రియలు నిర్వహించి ఖననం చేశారు. అయితే తన కూతురు మృతిపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు బుధవారం స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్‌లో తండ్రి సూర్య ప్రకాశరావు ఫిర్యాదు మేరకు తహసీల్దార్ డి.సైదులు, రూరల్ ఎస్‌ఐ రమేష్‌కుమార్, డాక్టర్ శ్రావణ్, శ్రీనివాస్ సమక్షంలో మడుపల్లిలో ఖననం చేసిన యువతి శవానికి పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు, పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత వివరాలను వెల్లడిస్తామని ఎస్‌ఐ రమేష్ కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News