Tuesday, May 21, 2024

ప్రభాస్ అభిమానులకు తీపి కబురు

- Advertisement -
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘మహానటి’ దర్శకుడు నాగ్‌అశ్విన్ ఓ పాన్ ఇండియా మూవీని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఈ భారీ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకునే హీరోయిన్‌గా నటించనుంది. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ సినిమా గురించి ప్రకటన వచ్చి ఏడాది గడుస్తున్నా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ సినిమా కంటే తర్వాత ప్రకటించిన ఆదిపురుష్, సలార్ సినిమాల ఫస్ట్‌లుక్‌లు కూడా విడుదలైపోయాయి. ఈ సినిమా గురించి మాత్రం ఎలాంటి అప్‌డేట్ లేదు. చివరికి సంక్రాంతికి కూడా ఈ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో ప్రభాస్ అభిమానులు నిరాశచెందారు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని ఈ సినిమా గురించి ట్విట్టర్ ద్వారా నాగ్ అశ్విన్‌ను ప్రశ్నించాడు. దీనికి స్పందించిన నాగ్ అశ్విన్.. “జనవరి 29, ఫిబ్రవరి 26న ఈ సినిమా అప్‌డేట్ వస్తుంది” అని అభిమానులకు తీపి కబురు చెప్పాడు. ఇక ఈ చిత్రాన్ని నిర్మాత సి.అశ్వనీ దత్ 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.

Prabhas and Nag Ashwin movie update on Jan 29

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News