Tuesday, April 30, 2024

ఎపి సిఎం రిలీఫ్ ఫండ్‌కి ప్రభాస్ రూ.కోటీ విరాళం..

- Advertisement -
- Advertisement -

Prabhas announces Rs 1 crore to AP CM RMF

హైదరాబాద్: ఇటీవల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కురిసిన భారీ వ‌ర్షాలతో చాలా మంది ప్ర‌జలు నిరాశ్ర‌యుల‌య్యారు. దీంతో వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తెలుగు సినిమా పరిశ్రమ నుంచి పలువురు హీరోలు, నిర్మాతలు తమ వంతు సాయంగా విరాళాలు సిఎం రిలీఫ్‌ ఫండ్‌కి అందజేశారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్‌, అల్లుఅర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు, చిరంజీవిలు రూ.25లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించగా, అల్లు అరవింద్‌ రూ.10లక్షలు విరాళంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి అందజేశారు. తాజాగా హీరో ప్రభాస్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. వరద బాధితులకు సాయంగా ప్రభాస్ రూ.కోటి విరాళం ప్రకటించాడు. దీంతో అభిమానులు, నెటిజన్లు భారీ విరాళంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Prabhas announces Rs 1 crore to AP CM RMF

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News