Saturday, May 4, 2024

చదరంగం చిచ్చర పిడుగు ప్రణీత్

- Advertisement -
- Advertisement -

వరల్డ్ చెస్ ఫెడరేషన్ గ్రాండ్ మాస్టర్ హోదాకు అర్హత సాధించడంపై సిఎం కెసిఆర్ హర్షం
సూపర్ గ్రాండ్ మాస్టర్‌గా ఎదగాలని ఆకాంక్ష
శిక్షణ, ఇతర ఖర్చుల కోసం రూ.2.5 కోట్లు నజరానా
దళిత క్రీడాకారిణి వీర్లపల్లి నందినికి సిఎం అభినందనలు, రూ.50లక్షలు ప్రకటన
మన తెలంగాణ/హైదరాబాద్: అత్యంత పిన్నవయస్సులోనే చెస్ క్రీడలో అంతర్జాతీ య ఖ్యాతి గడించిన తెలంగాణ చెస్ క్రీడాకారుడు ఉప్పల ప్రణీత్ (16) ‘వరల్డ్ చెస్ ఫెడరేషన్ గ్రాండ్ మాస్టర్’ హోదా దక్కించుకోవడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫెడరేషన్ ఉప్పల ప్రణీత్‌కు గ్రాండ్ మాస్టర్ హోదాను ప్రకటించిన నేపథ్యంలో సిఎం కె సిఆర్ ప్రణీత్‌ను, అతని తల్లిదండ్రులను సోమవారం సెక్రటేరియట్‌కు పిలిపించుకుని, ప్రణీత్‌ను దీవించారు. కష్టపడి ప్రణీత్‌కు శిక్షణ ఇప్పించి, గొప్పగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులను ఈ సందర్భంగా సిఎం అభినందించారు. చెస్ క్రీడ పట్ల ప్రణీత్‌కు ఉన్న అ భిరుచి, కఠోర సాధనే తనను గ్రాండ్ మాస్టర్‌గా తీర్చిదిద్దాయని సిఎం అన్నారు.

భవిష్యత్తులో ప్రణీత్ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, తెలంగాణకు, భారతదేశానికి గొప్ప పేరు, ప్రఖ్యాతులు తీసుకురావాలని సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉం టుందని సిఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా … భవిష్యత్తులో ప్రణీత్ చెస్ క్రీడలో సూపర్ గ్రాండ్ మాస్టర్‌గా ఎదిగేందుకు కావాల్సిన శిక్షణ, ఇతర ఖర్చుల కోసం రూ. 2.5 కోట్లను సిఎం కెసిఆర్ ప్రకటించారు. ఈసందర్భంగా ప్రణీత్ తల్లిదండ్రులు సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందిస్తూ, క్రీడారంగాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయనడానికి ప్రణీత్ గ్రాండ్ మాస్టర్‌గా ఎదిగిన తీరే నిదర్శనమని సిఎం అన్నారు.

దళిత క్రీడాకారిణి నందిని శిక్షణకు రూ.50 లక్షలు
అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడలో రాణిస్తూ వరల్డ్ చెస్ ఫడరేషన్ ద్వారా వుమన్ క్యాండిడేట్ మాస్టర్‌గా గుర్తింపు పొందిన దళిత క్రీడాకారిణి వీర్లపల్లి నందిని(19)ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందించారు. నందిని అంతర్జాతీయ స్థాయిలో మరెన్నో కీర్తిశిఖరాలను అధిరోహించేందుకు అవసరమైన శిక్షణ, ఇతర ఖర్చుల కో సం రూ.50 లక్షలను సిఎం కెసిఆర్ ప్రకటించారు. ఈ దిశగా తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా సిఎం కెసిఆర్ తన కార్యదర్శి భూపాల్ రెడ్డిని ఆదేశించారు.

సిఎం కెసిఆర్‌కు మంత్రి కృతజ్ఞతలు
చెస్ క్రీడాకారుడు ఉప్పల ప్రణీత్ ‘వరల్ చెస్ ఫెడరేషన్ గ్రాండ్ మాస్టర్’ అర్హత సా ధించినందుకు రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ రూ. 2.5 కోట్లు ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అత్యం త పిన్న వయస్సులో ప్రణీత్ ఘనత సాధించినందుకు అభినందించారు. చెస్‌లో రాణిస్తున్న దళిత క్రీడాకారిణి వీర్లపల్లి నందిని కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News