Wednesday, May 1, 2024

భూదాన్ పోచంపల్లికి చేరుకున్న రాష్ట్రపతి ముర్ము

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భూదాన్ పోచంపల్లికి చేరుకున్నారు. హెలిప్యాడ్ నుంచి ఇరవై ప్రత్యేక కార్లలో టూరిజం సెంటర్ కు రాష్ట్రపతి బయలుదేరారు. భూదానోద్యమ కారులైన ఆచార్య వినోభాబావే, భూదాత వెదిరే రాంచంద్రారెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాలాజీ పంక్షన్ హాల్ లో మగ్గాలు పరిశీలిస్తున్నారు. చేనేత కార్మికల దంపతులతో సమావేశం అయ్యారు. చేనేత మాస్టర్ వీవర్ శివకుమార్ తోను ప్రత్యేక సమావేశం కానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి తో కలిసి కేవలం ఆరుగురికి మాత్రమే వేదికపై ఆహ్వానం లభించింది. గవర్నర్ తమిళి సై, రాష్ట్ర మంత్రులు సీతక్క ,తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, స్థానిక ఎమ్మెల్యే కుంభంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇద్దరు అధికారులకు అవకాశం కల్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News