Friday, April 26, 2024

మాజీ ప్రధాని వాజ్‌పేయికి నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని

- Advertisement -
- Advertisement -

 

President Kovind pays tribute to Ex PM Vajpayee

న్యూఢిల్లీ: దేశ మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారి వాజ్‌పేయి 3వ వర్థంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోడీ నివాళులర్పించారు. సోమవారం ఉదయం ఢిల్లీలోని ఆయన సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్రపతి, ప్రధానితోపాటు ఉపరాష్ట్రతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా పలువురు ప్రముఖులు మాజీ ప్రధానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. బిజెపి నాయకులు, పత్రిపక్షాలు సోషల్ మీడియా ద్వారా వాజ్‌పేయికి నివాళులర్పించారు. కాగా, 1924, డిసెంబర్‌ 25న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జన్మించిన వాజ్‌పేయి, 2018, ఆగస్టు 16న మరణించారు.

President Kovind pays tribute to Ex PM Vajpayee

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News