Saturday, May 4, 2024

నేడు చిత్తూరులో పర్యటించనున్న రాష్ట్రపతి

- Advertisement -
- Advertisement -

President Ram Nath Kovind to visit Chittoor on Today

అమరావతి: చిత్తూరు జిల్లాలో రాష్ట్రపతి రామ్ నాథ్‌ కోవింద్‌ ఆదివారం పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12.10 గంటలకు వైమానిక దళం హెలీకాప్టర్‌లో జిల్లాలోని మదనపల్లెలో చిప్పిలికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి జగన్‌ స్వాగతం పలుకనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నేరుగా సత్సంగ్‌ ఆశ్రమానికి చేరుకుని ‘భారత్‌ యోగా విద్యా’ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత 38 పడకల స్వాస్థ్య ఆసుపత్రి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సదుం మండలంలోని పీపుల్స్‌గ్రోవ్‌ స్కూల్‌కు చేరుకుని విద్యార్థులతో ముచ్చటించనున్నారు.

President Ram Nath Kovind to visit Chittoor on Today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News