Friday, May 3, 2024

 ప్రైవేటు టీచర్లకు నగదు జమ

- Advertisement -
- Advertisement -

Teachers
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా సంక్షోభంలో ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బం ది ఆకలి బాధలు తీర్చి, అక్కున చేర్చుకొన్న తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రైవేట్ పా ఠశాలలకు సంబంధించిన బోధన, బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం అందిస్తున్న ఆపత్కాల సహాయాన్ని వారి వ్యక్తి గత అకౌంట్లకు జమ చేసే కార్యక్రమాన్ని సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పా ఠశాల విద్య సంచాలకులు దేవసేన తదితరులు పాల్గొ న్నారు. మే నెలకు సంబంధించిన రూ. 40 కోట్ల 94 లక్షల 86 వేలను 2,04,743 మంది బోధన, బోధనేతర సిబ్బంది అకౌంట్లకు సోమవారం బదలాయించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచే స్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది ఇబ్బందులను పెద్ద మ నసుతో అర్థం చేసుకొని ముఖ్యమంత్రి కెసిఆర్ మానవీ య కోణంలో ఆలోచించి సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నారని అన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతగా ఆ శాజనకంగా లేకపోయినా దేశంలోనే ప్రప్రథమంగా ప్రై వేట్ విద్యాసంస్థల్లో పనిచేసే టీచర్లు, సిబ్బందికి ఆర్థికంగా చేయూతనిచ్చి ప్రభుత్వం అండగా నిలిచిందని తెలిపారు. కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఛానళ్ల ద్వా రా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు డిజిటల్ తరగతులను నిర్వహించి, విద్యార్థుల్లో నాణ్యత ప్రమాణా లు తగ్గకుండా చర్యలు చేపట్టడాన్ని ఇటీవల కేంద్ర ప్రభు త్వం ప్రశంశించిందని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా యూట్యూబ్, ఇతర మాధ్యమాల ద్వారా తరగతుల ని ర్వహణను కూడా కేంద్రం న్నారు.

స్కూళ్లు తెరచే వరకూ సాయం

స్కూళ్లు మళ్లీ తెరిచే వరకూ ప్రైవేట్ పాఠశాలలకు సంబం దించిన బోధన, బోధనేతర సిబ్బందికి నెలకు రూ.2 వేల చొప్పున ఆపత్కాల ఆర్థిక సాయంతోపాటు కుటుంబానికి నెలకు ఉచితంగా 25 కిలోల రేషన్‌బియ్యం పంపిణీ చేస్తా మని మంత్రి తెలిపారు. ఏప్రిల్ నెలలో ముందుగా 1,25, 587 మంది లబ్ధిదారులను గుర్తించి వారి వ్యక్తిగత ఖాతా ల్లో రూ.2 వేల చొప్పున జమ చేయడం జరిగిందని తెలి పారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.25 కోట్ల 11 లక్షల 74 వేలు విడుదల చేసిందని వివరించారు. వీరికి రూ.11 కోట్ల 88 లక్షల 99 వేల 492 విలువైన 3,139 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఒక్కొక్కరికి 25 కిలోలు చొప్పున అం దించిచామన్నారు. ఈ ఆపత్కాల సహాయాన్ని మరిం త మందికి విస్తరించాలని ప్రైవేటు పాఠశాలల యాజమా న్యాలు ముఖ్యమంత్రి కెసిఆర్‌ను మరోసారి కోరడంతో వారి కోరికను మన్నించి మరో 79,156 మందిని లబ్ధి దారులుగా సిఎం ప్రకటించారని చెప్పారు. వీరికి ఇప్పటి కే ఏప్రిల్ నెలకు సంబంధించిన ఆపత్కాల సహాయాన్ని కూడా అందించామని అన్నారు. రాష్ట్రంలోని 11,046 ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న వారిలో రెండు విడతల్లో 2,04,743 మందిని లబ్ధిదారులుగా గుర్తించినట్లు మం త్రి తెలిపారు. ఇకపై వీరందరికీ ప్రతీ నెలా రూ.40 కోట్ల 94 లక్షల 86 వేలు, కోట్ల 38 లక్షల 40 వేల 435 విలువైన బియ్యాన్ని అందించనున్నట్లు వెల్లడించా రు. మే నెలకు సంబంధించిన సోమవారం నుంచి బి య్యం పంపిణీ జరుగుతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News