హైదరాబాద్: కరోనా వైరస్ తెలంగాణలో కరాళ నృత్యం చేస్తోంది. కరోనా వైరస్తో టాలీవుడ్ నిర్మాత పోకూరి రామారావు మృతి చెందారు. ఈతరం ఫిలింస్ బ్యానర్ నిర్మాత పోకూరి బాబూరావు సోదరుడే పోకూరి రామారావు. ఈతరం ఫిలింస్ బ్యానర్లో నేటి భారతం, ఎర్రమందారం, యజ్ఞం, రణం వంటి సినిమాలు రూపుదిద్దుకున్నాయి. కొద్ది రోజుల క్రితం రామారావు జ్వరం రావడంతో హైదరాబాద్ కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. కరోనా టెస్టు చేయగా పాజిటివ్ రావడంతో కాంటినెంటల్ ఆస్పత్రిలో ఐసోలేషన్ సెంటర్కు తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ చనిపోయాడు. ప్రసుత్తం తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 20,462 ఉండగా 283 మంది చనిపోయారు. కరోనా బారి నుంచి పది వేల మంది కోలుకోగా వివిధ ఆస్పత్రుల్లో 9984 మంది చికిత్స పొందుతున్నారు. భారత్లో కరోనా వైరస్ 6.49లక్షల మందికి సోకగా 18,678 మంది మృత్యువాతపడ్డారు.